విదేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా లేదా గాయపడినా వారి కుటుంబీకులు ఎంతో ఆవేదనకు గురవుతారు. అటువంటి వారికి సహాయపడుటకు APNRT Society ఉచిత అంబులెన్సు సేవలు అందిస్తుంది. ఇప్పటివరకు 385 మృతదేహాలను, 20 మంది గాయపడిన వారికి అంబులెన్సు సేవలు అందించి వారి వారి స్వస్థలాలకు తరలించటం జరిగింది.