Embassy
Facebook
Twitter
Instagram
Youtube
వందే భారత్ మిషన్ మరియు చార్టర్ ఫ్లైట్స్ ద్వారా ఈరోజు వరకు (11-07-2020) 108 విమానాల ద్వారా దాదాపు 3,500 మంది ప్రవాసాంధ్రులు హైదరాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు విమానాశ్రయం చేరుకొని పర్యవేక్షించారు.. వందే భారత్ మిషన్ ద్వారా హైదరాబాద్ కు విమానాలు ప్రారంభమైన మొదటి రోజు నుండి విమానాశ్రయం చేరుకున్న ప్రవాసాంధ్రులను రిసీవ్ చేసుకున్నప్పటి నుండి వారిని ఏపీ లోని క్వారంటైన్ కేంద్రాలకు పంపే వరకు జరిగే ప్రక్రియలో ఎక్కడ సమస్య తలెత్తకుండా పనిచేస్తోన్న రాష్ట్ర నోడల్ బృందాన్ని, ఏపీఎన్ఆర్టీఎస్ బృందాన్ని శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారు అభినందించారు.